పైన పేర్కొన్న ప్రాచీన జావళీకారుల రచనలతో ఆవిర్భవించిన జావళీలను అర్వాచీనులు సాదరంగా ఆహ్వానించి రచించారు. ఈ కింద పేర్కొన్నవారు అర్వాచీన కాలంలో ప్రధానంగా లభించిన జావళీ కర్తలు.
- చిన్నయ పిళ్ళై
- స్వాతి తిరునాళ్
- మాడుగుల వీరభద్ర సీతారామం
- నేతి సుబ్బరామ శాస్త్రి
- రామనాథపురం శ్రీనివాస అయ్యర్
- దాసు శ్రీరాములు
- పంతుల బ్రహ్మదేవ కవి
- బెంగళూరు చంద్రశేఖరయ్య
- శివరామయ్య
- పూసపాటి ఆనంద గజపతి రాజు
- కరూరు దక్షిణా మూర్తి
- ధర్మవరం రామకృష్ణమాచార్యులు
- కోట్రీక పుల్లయ్య సెట్టి
- ద్విభాష్యం పుల్లకవి
- దంపూరి సుబ్బారావు
- గబ్బిట యజ్ఞన్న కవి
- ఆదిభట్ల నారాయణ దాసు
- దుర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు
- దుడ్డు సీతారామయ్య
- మైనంపాటి కామయ్య
- మైనంపాటి నరసింహా రావు
- మైనంపాటి హనుమంత రావు
- గరిమెళ్ళ వేంకటేశ్వర కవి
- కీర్తి వేంకటరామ కవి
- కార్యంపూడి రాజమన్నారు కవి
- తాటితోపు పట్టాభి రామయ్య
- విద్యల తిరుపతి నారాయణ స్వామి నాయుడు
- పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
- ధర్మపురి సుబ్బారావు
- కరూరు చినదేవడయ్య
- వీణ కృష్ణమాచార్యులు
- తచ్చూర్ పెద సింగరాచార్యులు, చిన సింగరాచార్యులు
వంటి పండిత కవులు, వాగ్గేయకారులు కూడా జావళీలను రచించడమే జావళీల విశిష్టతకు గల తార్కాణం. జావళీలోని తుచ్ఛ శృంగారం అనే భావన వారికి ఉన్నట్లయితే జావళీలు రసవంతంగా ఈ మహనీయుల చేతిలో రూపు దిద్దుకొని ఉండేవి కావు.