అంత్య ప్రాసలు జావళీ నడకకు అందాన్ని చేకూరుస్తాయి. కొన్ని అక్షరాల్ సముదాయం క్రమబద్ధంగా పల్లవి అంతంలో గానీ, చరణాల అంతంలో గానీ, సమానంగా ఉండడం వల్ల రచనకు అందం పెరుగుతుంది.
ఉదాహరణకు:
- చేతిలో చెయ్యి వేసి చెంతకు చేరదీసి
బోదురు యెడబాసీ బుర్రకు మసి బూసీ - నారీ మరునిచే కఠారి వాలు చూపుల దారి
నడతల వయ్యారి చిన్నారి పొన్నారి కన్నారీ - నాతీ సంపూర్ణ చంద్రవతీ నడతతో గుణవతీ
జాతిలోకాళవతీ మదవతీ నాదాతీ సుదాతీ - ఈశా! శ్రీ చత్రపురీశా శ్రీ జగన్మోహనసంకాశ
సరస నాటక విధీశ వద్దేశ ప్రాణేశ లోకేశ - జాణరా! అలివేణిరా! పూబోణి పల్లవ పాణిరా
దానిగూడని జన్మమేలరా! మానినీ మణినేలరాశ
సారసంబును బోలురా! కమలారి రసహసించురా
సారసాక్షి ముఖము ముకురము మీరురా! - పెంచూ! రతి కేళి మెప్పించూ
చాలగ వలపించూ సరసము దేలించూ
మిప్పించు మేలించు లాలించు - ఏరా! రారా! చెయి తేరా!
ఈ మరుబారికి తాళగలేరా - కోపమెంతో చాలాల కోమలశీలా
రాపు జేసేవేలా రాజగోపబాల - గండు కోవెలలు గూయ కమలాల కాకసేయ
మెండు తుమ్మెదలు మ్రోయ గుండె ఝతఝత మనెనేయ - నినుబాసి నిదుర రాదు నిమిషమైన ప్రొద్దుపోదు
మనసిజు బారి కోర్వరాదు మమత నిలువ వశము గాదు